Amaravathi: అమరావతిపై విచారణ.. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

రాజధాని మార్పునకు అసెంబ్లీకి శాసనాధికారాలు లేవన్న హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. అయితే అమరావతిలో పనులు పూర్తి చేయడానికి విధించిన నిర్దిష్ట గడువులపై మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. అఫిడవిట్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. కోర్టులో విచారణ సందర్భంగా రైతుల భవితవ్యంపై ప్రశ్నలు వేసిన ధర్మాసనం.. హైకోర్టు ఎక్కడ ఉంటుందని పదే పదే ఆరా తీసింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

Updated : 29 Nov 2022 10:21 IST
Tags :

మరిన్ని