Supreme Court: సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0 ప్రారంభం

సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. న్యాయాధికారులు, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు ఈ అప్‌డేట్‌ వెర్షన్ వీలు కల్పిస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్లు, తీర్పులు, ఇతర పత్రాలను యాప్‌లోకి వెళ్లి పరిశీలించవచ్చని సీజేఐ తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, మరోవారం రోజుల్లో ఐవోఎస్‌ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. 2019 నవంబర్  26న ‘ఎస్‌సీఐ’ మెుబైల్ యాప్‌ను ప్రారంభించారు. 

Published : 08 Dec 2022 12:30 IST
Tags :

మరిన్ని