Andhra News: డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై వీడని అనుమానాలు

వైఎస్సార్ జిల్లా బద్వేలులో డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వీడటం లేదు. ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పకుండా.. ఫోరెన్సిక్ నివేదికపై నెపం నెట్టేస్తున్నారు. ఊపిరితిత్తులు, కాలేయంలోకి భారీగా నీరు చేరడంతో విద్యార్థిని చనిపోయిందంటున్న పోలీసులు.. ఆమె నదిలో దూకిందా? లేక ఎవరైనా తోశారా? అనే విషయాలపై స్పష్టం ఇవ్వలేదు. ప్రేమ పేరుతో వేధించిన గురుమహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు ఈ నెల 20న సిద్ధవటం కోటకు వెళ్లలేదని తేల్చిచెబుతున్నారు. దీంతో ఆ రోజు కోటలో ఏం జరిగిందో చిక్కుముడి వీడటం లేదు.

Updated : 25 Oct 2023 17:17 IST

వైఎస్సార్ జిల్లా బద్వేలులో డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వీడటం లేదు. ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా చెప్పకుండా.. ఫోరెన్సిక్ నివేదికపై నెపం నెట్టేస్తున్నారు. ఊపిరితిత్తులు, కాలేయంలోకి భారీగా నీరు చేరడంతో విద్యార్థిని చనిపోయిందంటున్న పోలీసులు.. ఆమె నదిలో దూకిందా? లేక ఎవరైనా తోశారా? అనే విషయాలపై స్పష్టం ఇవ్వలేదు. ప్రేమ పేరుతో వేధించిన గురుమహేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతడు ఈ నెల 20న సిద్ధవటం కోటకు వెళ్లలేదని తేల్చిచెబుతున్నారు. దీంతో ఆ రోజు కోటలో ఏం జరిగిందో చిక్కుముడి వీడటం లేదు.

Tags :

మరిన్ని