YSRCP: వైకాపా నేతల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం

వైకాపా నాయకుల వేధింపులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన దండ అవినాష్ రెడ్డి.. తెలుగుదేశం కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తుంటారు. ఇటీవల వైకాపా నాయకులు చంపుతానని బెదిరించటంతో.. అవినాష్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాను మరణిస్తే దానికి కారణం వైకాపా నేతలే అంటూ బాధితుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.

Published : 06 Jun 2023 16:07 IST

Tags :

మరిన్ని