YSRCP: వైకాపా నేతల వేధింపులు.. యువకుడి ఆత్మహత్యాయత్నం
వైకాపా నాయకుల వేధింపులు తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమాని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో జరిగింది. చందర్లపాడు మండలం కాండ్రపాడు గ్రామానికి చెందిన దండ అవినాష్ రెడ్డి.. తెలుగుదేశం కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తుంటారు. ఇటీవల వైకాపా నాయకులు చంపుతానని బెదిరించటంతో.. అవినాష్ రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. విషయం తెలుసుకున్న బంధువులు నందిగామ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. తాను మరణిస్తే దానికి కారణం వైకాపా నేతలే అంటూ బాధితుడు సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్గా మారింది.
Published : 06 Jun 2023 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్