AP News: విశాఖ ప్రజలు కోరుకునేది ఆర్థిక రాజధాని: అయ్యన్నపాత్రుడు

వైకాపా నిర్వహించిన విశాఖ గర్జన అట్టర్ ఫ్లాప్‌ అయిందని తెదేపా సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రజలు వైకాపా నాయకుల మాటలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. విజయసాయిరెడ్డి ఆస్తులు దోచుకెళతారనే భయంతో విశాఖ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోడంలేదని అయ్యన్న విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా అంగీకరించిన జగన్‌ ఇప్పుడెందుకు మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని వైకాపా నాయకులను ప్రశ్నించారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని మాత్రమే ప్రజలు కోరుకుంటున్నారని అయ్యన్న అన్నారు. 

Published : 16 Oct 2022 20:46 IST
Tags :

మరిన్ని