TDP: తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టలేరు: అయ్యన్నపాత్రుడు

సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన కుమారుడు విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్టు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్‌కు నోటీసులు వచ్చినట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలో ఈరోజు సీఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సజ్జల నేతృత్వంలోనే తాడేపల్లి వేదికగా తెదేపా బీసీ నేతలపై కుట్రలు జరుగుతున్నాయని దేవినేని ఉమా విమర్శించారు. అధికారం అండతో అరాచకాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలను అణగదొక్కాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Updated : 30 Jan 2023 12:21 IST

సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన కుమారుడు విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్టు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్‌కు నోటీసులు వచ్చినట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలో ఈరోజు సీఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. సజ్జల నేతృత్వంలోనే తాడేపల్లి వేదికగా తెదేపా బీసీ నేతలపై కుట్రలు జరుగుతున్నాయని దేవినేని ఉమా విమర్శించారు. అధికారం అండతో అరాచకాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీలను అణగదొక్కాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు