Telangana: 8 నెలల్లో తెలంగాణకు రూ.80 వేల కోట్ల పన్ను ఆదాయం

నవంబర్ నెల వరకు రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం ద్వారా రూ.80 వేల కోట్లకుపైగా సమకూరింది. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తంలో ఇది 64 శాతం వరకు ఉంది. పన్నేతర ఆదాయం అంచనాల్లో 36 శాతం వరకు రాగా, గ్రాంట్లకు సంబంధించి ఆ మొత్తం కేవలం 16 శాతంగానే ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఎనిమిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా రూ.లక్షా 23వేల కోట్లకు పైగా సమకూరగా... లక్షా 9 వేల కోట్ల రూపాయలు వ్యయం చేసింది.

Published : 29 Dec 2022 15:01 IST

Tags :

మరిన్ని