5G Spectrum: నేటి నుంచి 5జీ సేవల కోసం స్పెక్ట్రమ్ వేలం.. పోటీలో దిగ్గజ సంస్థలు

4జీ కంటే పదిరెట్లు వేగవంతమైన 5జీ సేవల కోసం స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. రూ.4.3లక్షల కోట్ల విలువైన 72 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను 20 ఏళ్లపాటు వినియోగించుకునేందుకు వేలం నిర్వహించనున్నారు. భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, అదానీ సంస్థలు వేలంలో పాల్గొననున్నాయి. ఉదయం పదిగంటలకు ప్రారంభం కానున్న బిడ్డింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరింటి వరకూ కొనసాగనుంది.

Published : 26 Jul 2022 12:53 IST
Tags :

మరిన్ని