Viral Video: జ్యూస్ తాగేందుకు వెళ్తే.. బైక్‌లోని ₹4.80 లక్షలు కొట్టేశారు!

పల్నాడు జిల్లా వినుకొండలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. బైక్‌లో ఉన్న రూ.4.80 లక్షల నగదు కొట్టేశారు. పగడాల కోటేశ్వరావు అనే వ్యక్తి బ్యాంక్‌లో డబ్బులు విత్‌డ్రా చేసుకొని.. పల్నాడు రోడ్డులోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల ముందు జ్యూస్‌ తాగేందుకు బండిని పార్క్‌ చేసి వెళ్లాడు. బ్యాంకు నుంచి కోటేశ్వరావును అనుసరిస్తున్న దుండగులు.. బైక్‌లోని నగదును తస్కరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Published : 05 Jun 2023 17:39 IST

Viral Video: జ్యూస్ తాగేందుకు వెళ్తే.. బైక్‌లోని ₹4.80 లక్షలు కొట్టేశారు!

Tags :

మరిన్ని