Crime News: ఆగివున్న స్కూటీ నుంచి రూ.3 లక్షలు చోరీ..!

బ్యాంకులో నగదును తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తిని అనుసరించిన దొంగలు.. రూ.3లక్షలు అపహరించారు. నిజామాబాద్‌లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరానికి చెందిన ప్రవీణ్.. ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.3 లక్షలు విత్ డ్రా చేసి తన స్కూటీ డిక్కీలో పెట్టాడు. వాహనం నిలిపి ఆయన ఓ ప్రైవేటు కార్యాలయంలోకి వెళ్లడం చూసిన దొంగలు.. స్కూటీ డిక్కీని తెరిచి నగదును ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Published : 01 Oct 2022 15:06 IST

Tags :

మరిన్ని