Crime News: స్నేహితుల కళ్లెదుటే.. చెరువులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి
మేడ్చల్ జిల్లా కీసర పరిధిలోని చిర్యాల్ గ్రామంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో పడి మృతి చెందారు. తీగల కృష్ణారెడ్డి కళాశాలకు చెందిన హరహరన్, ఉబేద్ అనే ఇద్దరు విద్యార్థులది బుధవారం పుట్టినరోజు కాగా.. మొత్తం 9 మంది విద్యార్థులు కలిసి చిర్యాల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వెళ్లే సమయంలో సరదాగా ఈత కొట్టేందుకు చిర్యాల నాట్కం చెరువుకు వెళ్లారు. ఈత కొడుతుండగా ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. మిగతా విద్యార్థులు చూస్తుండగానే.. హరిహరన్, ఉబేద్, బాలాజీ నీటిలో మునిగి విగతజీవులుగా మారారు.
Published : 28 Sep 2022 21:28 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!