Congress: ఇదే నా ఆహ్వానం.. తిరిగి వచ్చేయండి: రేవంత్ రెడ్డి
కర్ణాటక ప్రజల తీర్పును ప్రపంచమంతా స్వాగతిస్తుంటే.. ఆ ఫలితాలను పట్టించుకోవాల్సిన పనిలేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఈ మేరకు భాజపా- భారాస, మోదీ - కేసీఆర్ వేర్వేరు కాదని మండిపడ్డారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఆ నేతలకు భాజపా సిద్ధాంతాలతో సంబంధం లేదు. వివేక్, విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటల, జూపల్లి, పొంగులేటి లాంటి నేతలందరికీ ఇదే నా ఆహ్వానం.. కాంగ్రెస్లోకి రండి. అవసరమైతే పార్టీ కోసం 10 మెట్లు కిందకు దిగుతా. కలిసి పనిచేద్దాం’’ అని రేవంత్ కోరారు.
Updated : 18 May 2023 18:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?