Appalaraju: అప్పలరాజు మైక్‌లో మాట్లాడాల్సిందే.. ఏపీ మంత్రికి నిరసన సెగ

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. ఏ ఇతర కులాలను తమ గిరిజన జాబితాలో చేర్చవద్దని పలాసలో ఆదివాసీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో ఆదివాసీల నుంచి వినతిపత్రం తీసుకోవడానికి మంత్రి అప్పలరాజు రాగా, ఆదివాసీలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిని తీసుకొని ముగ్గురు, నలుగురితోనే మంత్రి మాట్లాడుతుండగా, మైక్‌లో మాట్లాడాలంటూ ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇక్కడ రాజకీయాలు చేయడమేంటని మంత్రి అసహనానికి గురయ్యారు.

Published : 25 Nov 2022 14:37 IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. ఏ ఇతర కులాలను తమ గిరిజన జాబితాలో చేర్చవద్దని పలాసలో ఆదివాసీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో ఆదివాసీల నుంచి వినతిపత్రం తీసుకోవడానికి మంత్రి అప్పలరాజు రాగా, ఆదివాసీలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిని తీసుకొని ముగ్గురు, నలుగురితోనే మంత్రి మాట్లాడుతుండగా, మైక్‌లో మాట్లాడాలంటూ ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇక్కడ రాజకీయాలు చేయడమేంటని మంత్రి అసహనానికి గురయ్యారు.

Tags :

మరిన్ని