Medchal: టపాసులు తమ ఇంటివైపు వచ్చాయంటూ తెరాస కౌన్సిలర్ భర్త దాడి!

అధికార తెరాస పార్టీ కౌన్సిలర్ భర్త దౌర్జన్యంగా మరో వ్యక్తి ఇంటికి వెళ్లి దాడికి పాల్పడిన ఘటన మేడ్చల్‌లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం దీపావళి పండుగ రోజున పొరుగింటి నుంచి బాణసంచా తన ఇంటి వైపు వచ్చాయంటూ అనుచరులతో కలిసి 22వ వార్డు కౌన్సిలర్ మాధవి భర్త నరేందర్ దాడికి దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్టు మేడ్చల్ పోలీసులు తెలిపారు.

Updated : 26 Oct 2022 14:04 IST
Tags :

మరిన్ని