KTR: యశ్వంత్‌ సిన్హాకు తెరాస మద్దతు.. ప్రతిపక్షాల కూటమిలో మేము లేము: కేటీఆర్‌

రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాకు తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. విపక్షాల మద్దతుతో రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తెరాస తరఫున ఎంపీ నామా నాగేశ్వరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, కేటీఆర్‌ సహా పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ తరఫున సంఘీభావం తెలిపిన అనంతరం యశ్వంత్‌ సిన్హాను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు కేటీఆర్‌ తెలిపారు. 

Published : 27 Jun 2022 14:50 IST

Tags :

మరిన్ని