Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ బండి సంజయ్ దీక్ష
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీనీ నిరసిస్తూ బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపడుతామని తొలుత ప్రకటించినప్పటికీ అనూహ్యంగా అమర వీరుల స్థూపం వద్ద దీక్షకు కూర్చున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Updated : 17 Mar 2023 15:52 IST
Tags :