Twitter: ట్విటర్‌ కార్యకలాపాల ఉనికే ప్రశ్నార్థకం..!

ట్విటర్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. యజమానిగా మారిన తర్వాత సగానికి పైగా ఉద్యోగులను తొలగించిన ఎలాన్ మస్క్.. మిగిలిన ఉద్యోగులకు కఠిన నిబంధనలు పెట్టడం మొదటికే మోసం తెచ్చినట్లైంది. వందలాది ఉద్యోగులు స్వచ్ఛందంగా సంస్థను వీడేందుకు సిద్ధమయ్యారు. మస్క్ బుజ్జగించినా కొందరు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో ట్విటర్ కార్యాలయాలను సోమవారం వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్‌కు సమాధికట్టినట్లు ఉన్న ఫొటోను మస్క్ షేర్  చేయడం... పలు అనుమానాలకు తావిస్తోంది.

Published : 18 Nov 2022 19:01 IST

Tags :

మరిన్ని