Fire Accident: డీజిల్‌ ట్యాంకర్‌ పేలి ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు

డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకుని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గౌన్ జిల్లాలో జరిగింది. బుధవారం ఉదయం అంజన్‌గాన్ గ్రామం వద్ద ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అదేసమయంలో ట్యాంకర్‌కు మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 22 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఇండోర్ ఆసుపత్రికి తరలించారు. 

Published : 26 Oct 2022 15:31 IST

డీజిల్ ట్యాంకర్‌కు మంటలు అంటుకుని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఖర్‌గౌన్ జిల్లాలో జరిగింది. బుధవారం ఉదయం అంజన్‌గాన్ గ్రామం వద్ద ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అదేసమయంలో ట్యాంకర్‌కు మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 22 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఇండోర్ ఆసుపత్రికి తరలించారు. 

Tags :

మరిన్ని