Hyderabad: అనాథ బాలికపై లైంగిక దాడి.. మేడ్చల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి ఘటన
మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లోని ఓ అనాథాశ్రమంలో బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈనెల 19న నలుగురు బాలికలు కనిపించకుండా పోయారని.. అనాథాశ్రమ నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరు బాలికల ఆచూకీ సికింద్రాబాద్లో గుర్తించారు. మరో ఇద్దరు.. బంధువుల ఇళ్లలో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. సఖి సెంటర్కు తరలించి బాలికలకు కౌన్సెలింగ్ ఇవ్వగా.. అందులో ఓ అమ్మాయి తనపై లైంగికదాడి జరిగినట్టు చెప్పింది. అనాథశ్రమంలో అకౌంటెంట్గా పని చేస్తున్న మురళి.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకే తాము పారిపోయామని తెలిపినట్లు సమాచారం. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనాథశ్రమ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Updated : 26 Oct 2022 12:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?