Indian Navy: ‘గోవింద్ అమర్రహే’.. వెయ్యి ద్విచక్ర వాహనాలతో కన్నీటి వీడ్కోలు
ఇండియన్ నేవీ (Indian Navy) మెరైన్ కమాండర్గా పనిచేస్తూ ప్రమాదవశాత్తూ మృతిచెందిన చందక గోవింద్ (30) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య స్వగ్రామంలో ముగిశాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన గోవింద్.. విశాఖపట్నంలో విధులు నిర్వర్తించేవారు. పారాచూట్ శిక్షణ నిమిత్తం కోల్కతా వెళ్లిన ఆయన.. అక్కడ ప్రమాదవశాత్తూ మృతిచెందారు.ఆయన భౌతికకాయం శుక్రవారం ఉదయం పెనుబర్తి గ్రామానికి చేరింది. అక్కడి నుంచి మృతదేహాన్ని అంబులెన్స్లో సుమారు 10 కి.మీ దూరంలోని స్వగ్రామం పర్లకు చేర్చారు. అంబులెన్స్ వెంట పరిసర గ్రామాల ప్రజలు, యువత సుమారు వెయ్యి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు.
Published : 07 Apr 2023 16:11 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!