Rahul Gandhi: జీవితకాలం అనర్హత వేటు వేసినా.. నా పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ

దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తన పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నేరపూరిత పరువునష్టం కేసులో లోక్‌సభ సభ్యత్వం రద్దయిన మరుసటిరోజు మీడియా ముందుకు వచ్చిన రాహుల్.. తన గురించి కేంద్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్య రక్షణ కోసం తానెప్పుడూ ఇతర దేశాల సహాయం కోరలేదన్నారు. లండన్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా.. స్పీకర్ ఓంబిర్లా అవకాశం ఇవ్వలేదని రాహుల్  పేర్కొన్నారు.

Published : 25 Mar 2023 15:47 IST
Tags :

మరిన్ని