Gunturu: గుంటూరులో బైక్‌ చోరీ.. ఎలా జరిగిందో చూడండి..!

ద్విచక్ర వాహనం నిలిపి తాళం బండికే ఉంచితే.. ఏమవుతుందో గుంటూరు నగరంలో జరిగిన ఘటన రుజువు చేసింది. చంద్రమౌళి నగర్ వద్ద దుకాణం వద్దకు ద్విచక్ర వాహనం మీద వచ్చిన ఓ వ్యక్తి.. బండికి తాళం అలానే ఉంచి లోపలికి వెళ్లాడు. ఇంతలో ఓ వ్యక్తి ఆ బైక్ ని స్టార్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 30 Oct 2022 18:47 IST
Tags :

మరిన్ని