AP News: ‘సంకల్ప సిద్ధి మోసం’ ఆరోపణలపై స్పందించిన వల్లభనేని వంశీ

సంకల్ప సిద్ధి మార్ట్‌ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తెదేపా నేతలు కావాలనే తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ మేరకు విజయవాడలో డీజీపీ రాజేంద్రనాథ్‌ను కలిసిన వంశీ.. సంకల్ప సిద్ధి వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. ఇప్పటికే ఇద్దరు నేతలకు లీగల్ నోటీసులు పంపానని.. వారు స్పందించకుంటే హైకోర్టుకు వెళ్తానని చెప్పారు. 

Published : 01 Dec 2022 22:35 IST
Tags :

మరిన్ని