Ap News: జల విషాదానికి ఏడాది పూర్తి.. బాధితులకు అందని సాయం

అన్నమయ్య జలాశయం సృష్టించిన జలప్రళయంలో కొట్టుకుపోయిన ఇళ్లు, మృతి చెందిన కుటుంబ సభ్యుల ఘోష.. ఏడాది గడిచినా ఇంకా కళ్లముందే మెదలుతూనే ఉన్నాయి. ఆపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం, ముఖ్యమంత్రి.. పట్టించుకోలేదని రాజంపేట మండలంలోని ఎగువ మందపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక కోసమే అన్నమయ్య డ్యాం గేట్లు ఎత్తకుండా ఆలస్యం చేసి మనుషుల ప్రాణాలు తీశారని.. పరామర్శకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్ద వారు ఆక్రోశం వెలిబుచ్చారు

Published : 20 Nov 2022 12:45 IST
Tags :

మరిన్ని