Vijay Devarakonda: డ్యాన్సులంటే నాకు చిరాకు.. కానీ మీ కోసమే చేశా: విజయ్‌ దేవరకొండ

ఆగస్టు 25న ఇండియా షేక్‌ అవుతుందని నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘లైగర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక గురువారం ఉదయం సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్‌.. ‘‘ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా కుటుంబం గురించి తెలియదు. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అది కూడా అంత పెద్దగా చెప్పుకొనే సినిమా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్‌కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్‌లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా షేక్‌ అవుతుంది’’ అని అన్నారు.

Published : 21 Jul 2022 13:29 IST

ఆగస్టు 25న ఇండియా షేక్‌ అవుతుందని నటుడు విజయ్‌ దేవరకొండ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘లైగర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుక గురువారం ఉదయం సుదర్శన్‌ థియేటర్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్‌.. ‘‘ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా కుటుంబం గురించి తెలియదు. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అది కూడా అంత పెద్దగా చెప్పుకొనే సినిమా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్‌కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్‌లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా షేక్‌ అవుతుంది’’ అని అన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు