Vijay Devarakonda: డ్యాన్సులంటే నాకు చిరాకు.. కానీ మీ కోసమే చేశా: విజయ్ దేవరకొండ
ఆగస్టు 25న ఇండియా షేక్ అవుతుందని నటుడు విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ వేడుక గురువారం ఉదయం సుదర్శన్ థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న విజయ్.. ‘‘ఈ రోజు మీ అందర్నీ చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. నా కుటుంబం గురించి తెలియదు. నా మునుపటి సినిమా విడుదలై రెండేళ్లు అవుతుంది. అది కూడా అంత పెద్దగా చెప్పుకొనే సినిమా కాదు. అయినా, ఈరోజు ట్రైలర్కు మీ నుంచి వస్తోన్న స్పందన చూస్తుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఈ చిత్రాన్ని మీకే అంకితం చేస్తున్నా. మీకోసమే సినిమాలో ఆ బాడీ ట్రై చేశా. డ్యాన్సులంటే నాకు చిరాకు. కానీ, మీ కోసమే చేశా. మీరందరూ గర్వంగా ఫీలవ్వాలనే అంత కష్టపడ్డా. ఆగస్టు 25న థియేటర్లు అన్నీ నిండిపోవాలి. ఆ రోజు ఇండియా షేక్ అవుతుంది’’ అని అన్నారు.
Published : 21 Jul 2022 13:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ