Aksha: ఆరేళ్ల క్రితం విడిపోయిన అమ్మానాన్నలను ఒక్కటి చేసిన చిన్నారి!

ఆర్థిక సమస్యలు సృష్టించిన మనస్పర్ధలతో ఆరేళ్ల క్రితం విడిపోయిన తల్లిదండ్రులను ఓ చిన్నారి ఏకం చేసింది. అదృశ్యమైన చిన్నారి ఆక్ష కోసం తల్లి దేశమంతా వెతికినా కనిపించలేదు. అయితే ఇటీవల కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో నాటకీయంగా పాప ఆచూకీ వెలుగులోకి రావడంతో పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు లోతుగా పరిశీలించి, తల్లిదండ్రులను గుర్తించారు. పాపను తిరిగి కన్నవారి చెంతకు చేర్చారు. ఆ ఆనందంలో ఇంతకాలం దూరంగా ఉన్న దంపతులు ఒక్కటయ్యారు.

Updated : 30 May 2023 12:10 IST
Tags :

మరిన్ని