Viral Video: రైలు - ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ

బాపట్ల జిల్లా చీరాల (Chirala) రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతూ జారిపడిన మహిళను.. రైల్వే పోలీసులు కాపాడారు. చీరాల రైల్వే స్టేషన్‌లో కదులుతున్న విజయవాడ - గూడూరు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కే క్రమంలో ఓ మహిళ జారిపడ్డారు. రైలు బోగి, ప్లాట్‌ఫామ్‌ మధ్య ఆమె ఇరుక్కుపోయారు. వెంటనే అప్రమత్తమైన RPF పోలీసులు కోటేశ్వరరావు, నాగార్జున.. ప్రయాణికుల సాయంతో మహిళను కాపాడారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మహిళను.. 108 వాహనంలో చీరాల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Updated : 28 Apr 2023 15:20 IST

Viral Video: రైలు - ప్లాట్‌ఫామ్‌ మధ్యలో ఇరుక్కుపోయిన మహిళ

Tags :

మరిన్ని