Hyderabad: చిన్నారిని కాపాడబోయి.. కరెంట్ షాక్తో మహిళ మృతి
విద్యుదాఘాతానికి గురైన చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించి ఓ మహిళ మృతి చెందింది. కేపీహెచ్పీ (KPHB) అడ్డగుట్ట సొసైటీలోని ఎలిగేన్స్ ప్రైడ్ అపార్ట్మెంట్లో.. వాచ్మెన్గా పని చేస్తున్న శ్రీను తన భార్య ఇద్దరు కుమార్తెలతో జీవిస్తున్నాడు. అపార్ట్మెంట్ వెనకాల శ్రీను కుమార్తెలతోపాటు బంధువుల అమ్మాయి శ్రీలక్ష్మి ఆడుకుంటూ.. చెట్టును పట్టుకుంది. అప్పటికే కేబుల్స్ తగిలి చెట్టుకు విద్యుత్ ప్రవహిస్తోంది. దీంతో విద్యుదాఘాతానికి గురైన శ్రీలక్ష్మి అరుపులతో శ్రీను భార్య బాపణమ్మ అక్కడకు వచ్చింది. చిన్నారిని కాపాడే ప్రయత్నంలో షాక్కు గురై బాపణమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శ్రీలక్ష్మి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Published : 06 Jun 2023 17:25 IST
Tags :