Telangana news: చనిపోయిన తల్లి.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల వేదన

ఆ చిన్నారులకు అమ్మ ఇక తిరిగి రాలేదని తెలియదు. అందుకే ఎప్పటిలాగే తల్లి మృతదేహం వద్ద ఆడుకున్నారు. అమ్మను ముద్దాడారు. ఈ హృదయవిదారక దృశ్యాలు చూసి.. అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయం తల్లడిల్లిపోయింది. కరీంనగర్ జిల్లా అలుగునూరులో అనూష అనే మహిళ.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. ఆమె ఇద్దరు పిల్లలు తల్లిలేని వారయ్యారు. అమ్మ మృతదేహం వద్ద చిన్నారులు రోదించిన తీరు కలచివేసింది. 

Published : 18 Aug 2022 11:06 IST

Tags :

మరిన్ని