AP News: సామాజిక పింఛన్ల పెంపునకు పచ్చజెండా
సామాజిక పింఛన్లను జనవరి 1 నుంచి రూ.2,750కు పెంచాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఆ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. జిందాల్ స్టీల్ భాగస్వామిగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు పచ్చజెండా ఊపిన మంత్రి మండలి.. ముఖ్యమంత్రి పుట్టినరోజున 8వ తరగతి విద్యార్థులకు 5 లక్షల ట్యాబ్ల పంపిణీకి నిర్ణయించింది.
Published : 13 Dec 2022 20:26 IST
Tags :