YS Sharmila: ప్రగతి భవన్ వేదికగా టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు!: షర్మిల

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీకి ఐటీ శాఖ వైఫల్యమే ప్రధాన కారణమని పేర్కొంటూ వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై దర్యాప్తు ప్రగతి భవన్ వేదికగా సాగుతోందని.. దోషులు ఎవరన్నది కూడా ప్రగతి భవనే నిర్ణయిస్తోందంటూ షర్మిల ఆరోపించారు. ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

Published : 05 May 2023 16:43 IST
Tags :

మరిన్ని