YS Sharmila: ఆడవాళ్లు ప్రశ్నించకూడదా?: వైఎస్‌ షర్మిల

తెలంగాణలో మహిళలకు గౌరవం లేదని.. మహిళలందరూ ఏకమై కేసీఆర్‌ సర్కారును ఓడించాలని వైతెపా (YSRTP) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే.. పాలక పక్ష నేతలు దూషణలు చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. గతంలో మాదిరిగానే మహబూబాబాద్‌లోనూ లాండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించారన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అసభ్య పదజాలం వాడటం వల్లే.. తాను స్పందించాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ఆయన చేసేదే మాఫియా, కబ్జాలని షర్మిల మండిపడ్డారు. 

Updated : 19 Feb 2023 22:14 IST

Tags :

మరిన్ని