Viveka Murder Case: సీఎం సంరక్షణలో అవినాష్‌ రెడ్డి.. సుప్రీం కోర్టులో సునీత నివేదన

వైఎస్‌ వివేకా హత్య కేసులో అరెస్టు కావాల్సిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంరక్షణలో ఉన్నారని సుప్రీం కోర్టుకు వివేకా కుమార్తె సునీత నివేదించారు. ఈ నెల 25 వరకూ అవినాష్‌ను అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేసిన ఆమె.. ఈ నెల 30 లోపు కేసు విచారణ పూర్తి చేయాలన్న సుప్రీం ఆదేశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సునీత పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.

Published : 20 Apr 2023 20:12 IST

Tags :

మరిన్ని