Viveka Murder Case: వివేకా హత్యకేసులో భాస్కర్రెడ్డి, అవినాష్రెడ్డిలకు సీబీఐ పిలుపు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ నుంచి పిలుపు అందింది. ఎంపీని ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. భాస్కర్రెడ్డిని ఈ నెల 23న పులివెందులలో విచారిస్తామని...ఆయన వయసును దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది.
Published : 19 Feb 2023 09:39 IST
Tags :