YSRCP: తెదేపా, జనసేన సానుభూతిపరులపై వైకాపా సర్పంచ్‌ కుమారుడి దాడి..!

తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలం సుక్రోళ్లఇళ్లు గ్రామంలో తెదేపా, జనసేన సానుభూతిపరులపై వైకాపా వర్గీయులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇచ్చిన సంక్రాంతి కానుకలు తీసుకొని.. ఆయన ఫ్లెక్సీలు, బ్యానర్లు, వైకాపా జెండా లేకుండా పండుగ ఎలా చేస్తారంటూ రెచ్చిపోయారు. సర్పంచ్ లక్ష్మణ్ రెడ్డి కుమారుడు అమర్నాథ్ రెడ్డి.. సుమారు 50మందితో కలసి గ్రామస్థులపై మూకుమ్మడిగా దాడి చేసినట్టు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరు గ్రామస్థులు గాయపడ్డారు. ఘటనపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

Updated : 17 Jan 2023 17:32 IST
Tags :

మరిన్ని