YSRCP: పుంగనూరులో వైకాపా శ్రేణుల వీరంగం.. పారిశ్రామికవేత్త ఇంటిపై దాడి..!

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. గత ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వాహనాలు, వస్తువులు, అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమయ్యాయి. అంతకుముందు ఆదివారం ఉదయం నుంచే రైతుభేరి సమావేశానికి వెళ్లనీయకుండా రామచంద్ర యాదవ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Published : 05 Dec 2022 12:24 IST
Tags :

మరిన్ని