Viral Audio: తెదేపా నాయకులపై తప్పుడు కేసులు.. వైకాపా నేత ఫోన్కాల్ ఆడియో వైరల్!
ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తిరుపతి(Tirupati) జిల్లా ఏర్పేడు మండల తెలుగుదేశం(TDP) నాయకులపై తమ పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టించారంటూ వైకాపా(YSRCP) కార్యకర్త మాట్లాడుతున్న ఆడియో వైరల్(Viral Audio) అయింది. ఏర్పేడు జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం, వైకాపా నేతల మధ్య నెలకొన్న వివాదంలో పాత వీరాపురానికి చెందిన వైకాపా కార్యకర్త దామోదరరెడ్డి గాయపడ్డారంటూ ఆస్పత్రిలో చేర్చారు. దామోదర్ రెడ్డి గాయపడటానికి తెదేపా వర్గీయులే కారణమని వైకాపా నాయకులు చెప్పారు. అదే రోజు మరో వ్యక్తితో కలిసి దామోదర్ రెడ్డి పోలీసు స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారు. ఈ కేసుతో ఆందోళన చెందిన తెలుగుదేశం నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లారు. వైకాపా నేతలు తనతో తప్పుడు కేసులు పెట్టించారని దామోదర్ రెడ్డి తెలుగుదేశం నాయకులకు ఫోన్ లో చెప్పారు. ఆ ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం