YSRCP: వైకాపా సమావేశం నుంచి బయటికి వెళ్లకుండా గేటుకు తాళం

ప్లీనరీ సమావేశం మధ్యలో జనం వెళ్లిపోకుండా పాడేరు వైకాపా నేతలు పకడ్బందీ వ్యూహం వేశారు. సమావేశం ముగిసే వరకూ ఎవరూ బయటికి వెళ్లకుండా గేటుకు తాళం వేసేశారు. అల్లూరి జిల్లా పాడేరులో నిర్వహించిన వైకాపా ప్లీనరీకి ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లిపోకుండా ప్రధాన గేటుకు తాళం వేశారు. వెనుక వైపు నుంచి వెళ్లడానికి కూడా వీల్లేకుండా చేశారు. మంచినీళ్ల కోసమని చెప్పినా బయటకు పంపలేదని కొందరు వాపోయారు.

Published : 01 Jul 2022 18:52 IST
Tags :

మరిన్ని