YSRCP: కర్నూలు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేకు నిరసన సెగ..!

కర్నూలు జిల్లా ఆదోని మండలం మాంత్రికి గ్రామంలో వైకాపా(YSRCP) ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేను.. సంక్షేమ పథకాలు తమకు అందడం లేదంటూ స్థానిక మహిళ నిలదీశారు. ఆమెకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Published : 28 Jan 2023 18:02 IST
Tags :

మరిన్ని