YSRCP: మీసం మెలేసి.. తెదేపా శ్రేణులకు వైకాపా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సవాల్!
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ శావల్యాపురంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. అదే మార్గంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు (Bolla Brahma Naidu) వచ్చారు. తెదేపా శ్రేణుల నినాదాలు విని ఆగ్రహంతో ఊగిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు.. కారులో నుంచి బయటకు వచ్చి ‘‘దమ్ముంటే రండి చూసుకుందాం. మీ సంగతి తేలుస్తా అంటూ’’ దుర్భాషలాడుతూ మీసం మెలేశారు. పోలీసులు కలుగజేసుకొని ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు.
Published : 15 May 2023 17:26 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?