Andhra News: గ్రామాల అభివృద్ధికి నిధులివ్వండంటూ జోలె పట్టిన వైకాపా సర్పంచ్!

గ్రామాల అభివృద్ధికి నిధులివ్వండంటూవైకాపా సర్పంచ్ ఒకరు జోలె పట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల సర్వ సభ్యసమావేశంలో.. పలువురు సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీటీసీలే మాట్లాడాలని.. సర్పంచ్‌లు ఏమైనా ప్రస్తావించాలనుకుంటే ఎంపీపీ అనుమతి తీసుకోవాలంటూ.. ఎంపీపీ అమృత్ రాజ్ వ్యాఖ్యానించారు. సొంత డబ్బుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశామని, బిల్లుల గురించి నోరెత్తొద్దంటే ఎలాగని నిలదీశారు. జోలెపట్టి అడక్కుతినే పరిస్థితి వచ్చిందంటూ షేక్షనుపల్లి సర్పంచ్ లింగన్న ఆవేదన చెందారు.

Published : 15 Sep 2022 14:01 IST

Tags :

మరిన్ని