YSRCP: పార్టీ కోసం జెండా మోస్తే.. కేసుల్లో ఇరుక్కున్నాం!: వైకాపా మహిళా కార్యకర్త ఆవేదన

వైకాపా జెండా మోసి పార్టీ కోసం కష్టపడితే.. ఈరోజు తమ మీదే కేసులు బనాయిస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ ఎదుట ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదుట.. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ వైకాపా కార్యకర్త సునీత విలపించారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తన పైనే ఎస్సీ యాక్టు కింద కేసు నమోదు చేశారంటూ వాపోయారు. వైకాపా కోసం జెండా మోస్తే ఈరోజు కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. దయచేసి ఎవరూ వైకాపా కోసం కష్టపడొద్దంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Updated : 30 Nov 2022 10:45 IST

వైకాపా జెండా మోసి పార్టీ కోసం కష్టపడితే.. ఈరోజు తమ మీదే కేసులు బనాయిస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ ఎదుట ఓ మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదుట.. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ వైకాపా కార్యకర్త సునీత విలపించారు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తన పైనే ఎస్సీ యాక్టు కింద కేసు నమోదు చేశారంటూ వాపోయారు. వైకాపా కోసం జెండా మోస్తే ఈరోజు కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. దయచేసి ఎవరూ వైకాపా కోసం కష్టపడొద్దంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని