
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో జరిగిన ఓ వివాహ వేడుకలో వంటగాడు హేయమైన చర్యకు పాల్పడ్డాడు. నలుగురు తినాల్సిన రోటీలపై ఉమ్మివేసి తయారుచేశాడు. ఇది కాస్త అక్కడున్న ఓ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది నెట్టింట వైరల్గా మారింది. దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సొహైల్గా గుర్తించారు. అయితే, ఈ ఘటనపై హిందూ జాగరణ్ మంచ్ సభ్యులు మేరఠ్లోని ఎల్ఎల్ఆర్ఎం పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విందు వేడుకల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు సచిన్ సిరోహి డిమాండ్ చేశారు.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
దేవతార్చన
- ఆఫర్ కోసం చిరు, పవన్లకు కాల్ చేశా: కోట
- మాగంటిబాబు కుమారుడి కన్నుమూత
- తెలుగు హీరోయిన్ కోసం బన్నీ పట్టుబట్టాడు
- అఫ్రిది అల్లుడవుతున్న షహీన్
- నా పేరు చెప్పుకొని డ్రింక్ తాగండి: రవిశాస్త్రి
- జూమ్కాల్లో భోజనం.. విస్తుపోయిన సొలిసేటర్!
- శాకుంతలం: దేవ్ మోహన్ ఎవరో తెలుసా..?
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్కి ముందే తెలుసు
- ఆచార్య ఫొటో వైరల్.. ఇలియానా బెంగ
- ‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్