మచ్చలేని నేత.. మన ‘నర్రా’
నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన మార్క్సిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి అవినీతి మచ్చలేని నేతగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు.
నకిరేకల్, న్యూస్టుడే: నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన మార్క్సిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి అవినీతి మచ్చలేని నేతగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు. వరుస విజయాల ఎర్రకోటగా.. ఏపీ బెంగాల్గా నకిరేకల్కు నర్రా అరుదైన గుర్తింపు సొంతం చేశారు. ఈ సెగ్మెంట్ ఆవిర్భవించి ఆరున్నర దశాబ్దాలు దాటింది. ఇప్పటి వరకు 14 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో 10 పర్యాయాలు కమ్యూనిస్టులే విజయం సాధించారు. ఇక్కడ 47 ఏళ్ల పాటు ఎర్రజెండా పాలనే సాగింది.
ఇద్దరిలో ఒకరు
2007లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా లోక్సత్తా సంస్థ మచ్చలేని నేతలను ఇద్దరిని మాత్రమే గుర్తించగా అందులో నర్రా ఒకరు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నాడు ఆ సంస్థ ఆధ్వరంలో హైదరాబాద్లో రాఘవరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఇదీ.. ప్రస్థానం
నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి బడికి వెళ్లాల్సిన 16 ఏళ్ల వయసులో ముల్లు కర్ర పట్టి పశువులు మేపేందుకు వెళ్లారు. ముంబాయి జిన్నింగ్ మిల్లుల్లో కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అవినీతి అక్రమాలు, బంధుప్రీతికి దూరంగా ఉంటు తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.
- నాడు రైతుల భాగస్వామ్యంతో నియోజకవర్గంలో ఒకే సారి 50 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.
- ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చినా తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు.
- ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు వచ్చే వేతనంలో కొంత భాగాన్ని పార్టీకి ఇచ్చేవారు.
వరుస విజయాలు
1967లో సీపీఎం నుంచి రాఘవరెడ్డి తొలిసారి విజయం సాధించారు. 1972లో పరాజయం పాలయ్యారు. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వెనుతిరిగి చూడకుండా వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. వయో భారంతో 2015 ఏప్రిల్ 9న తన 91వ ఏటా మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
[ 29-04-2024]
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలోని ఓ ఏటీఎంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రూ.8 లక్షల నగదు దగ్ధం అయ్యింది. -
భువనగిరి బరిలో 39 మంది
[ 29-04-2024]
భువనగిరి పార్లమెంటు స్థానానికిగాను 12 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా పోటీలో 39 మంది మిగిలారు. -
పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
[ 29-04-2024]
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. -
గెలుపు వ్యూహం..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపు కోసం భాజపా వ్యూహాలు రచిస్తోంది. -
సాగు ప్రణాళిక ఖరారు.. విత్తనాలకు ప్రతిపాదనలు
[ 29-04-2024]
నల్గొండ జిల్లా వానాకాలం పంటల సాగుపై వ్యవసాయశాఖ దృష్టి సారించింది. సాగును అంచనా వేసి అవసరమైన విత్తనాలు కోసం జిల్లాలో ప్రణాళిక సిద్ధం చేసింది. -
భానుడు భగ్గుమనె..!
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాపై ఆదివారం భానుడు నిప్పులు చెరిగాడు. ఏడు మండలాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిబంధనలకు నీళ్లు..!
[ 29-04-2024]
కోదాడ పట్టణంలో సుమారు 30 వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పురపాలిక నుంచి అనుమతి తీసుకున్నవి ఐదు మాత్రమే. -
మడిగల్లోనే దశాబ్దాలుగా..!
[ 29-04-2024]
దేవరకొండ రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రం, పురపాలికలో ఏ దుకాణాలు అద్దెకు తీసుకోవాలన్నా.. రూ.వేలు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. -
నల్లబజార్కు భారత్ సరకులు..!
[ 29-04-2024]
మార్కెట్లో నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలలుగా రాయితీపై సరఫరా చేస్తున్న ‘భారత్ దాల్’ను మిర్యాలగూడ కేంద్రంగా కొందరు అక్రమార్కులు ప్యాకెట్లు చింపి.. బస్తాల్లో నింపి ఏపీలోని పలు జిల్లాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. -
ద్వితీయ శ్రేణి.. గుంభనం వీడదేమీ!
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు.. లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అగ్రనాయకుల హడావుడి తప్ప కిందిస్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. -
ఒక్కొక్కరికి ఒక్కోలా.. అందరూ వినియోగించుకునేలా
[ 29-04-2024]
ఓటును అందరూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఉపయోగించుకోలేరు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సైనికులు, గుఢాచారి వ్యవస్థల్లో పనిచేసే వారు తమ ఓటును ఉపయోగించుకునేందుకు వివిధ మార్గాలను ఎన్నికల సంఘం కల్పించింది. -
రఘువీర్ 44.. నర్సయ్య 65
[ 29-04-2024]
ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల నుంచి బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ 44 ఏళ్లలో అతి చిన్న వయస్కుడిగా నిలవగా... భువనగిరి భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ 65 ఏళ్లతో అత్యధిక వయస్కుడిగా నిలిచారు. -
ప్రేమజంట బలవన్మరణం
[ 29-04-2024]
ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ.. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం తుమ్మలపెన్పహాడ్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. -
ఓటెత్తేలా.. స్ఫూర్తి చాటేలా..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. -
700 ఏళ్ల నాటి సంకెళ్ల బావి
[ 29-04-2024]
అది చరిత్ర పుటల్లో శిథిలమైన మహానగరం.. చుట్టూ అడవి.. ఎతైన కొండలు..కోటలు.. ఇంకొంచెం తొంగిచూస్తే మరెన్నో చారిత్రక విశేషాలు. -
త్వరలో భారాస కనుమరుగు: రాజగోపాల్రెడ్డి
[ 29-04-2024]
భారాస త్వరలో కనుమరుగవుతుందని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి జోస్యం చెప్పారు. -
ఆమె కోసం..!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో మహిళా శక్తే ప్రాధాన్యంగా కనిపిస్తోంది. అభ్యర్థులు, నాయకుల దృష్టి మహిళా ఓటర్లపైన పడింది. -
డిజిటల్ లావాదేవీలపై నిఘా..
[ 29-04-2024]
ఆలేరుకు చెందిన ఓ ఖాతాదారుడు భువనగిరిలో నివాసం ఉంటున్నాడు. ప్రైవేట్ బ్యాంకు నుంచి అధికారులు ఫోన్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM