మచ్చలేని నేత.. మన ‘నర్రా’

నకిరేకల్, న్యూస్టుడే: నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించిన మార్క్సిస్టు యోధుడు నర్రా రాఘవరెడ్డి అవినీతి మచ్చలేని నేతగా ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు పొందారు. వరుస విజయాల ఎర్రకోటగా.. ఏపీ బెంగాల్గా నకిరేకల్కు నర్రా అరుదైన గుర్తింపు సొంతం చేశారు. ఈ సెగ్మెంట్ ఆవిర్భవించి ఆరున్నర దశాబ్దాలు దాటింది. ఇప్పటి వరకు 14 దఫాలుగా జరిగిన ఎన్నికల్లో 10 పర్యాయాలు కమ్యూనిస్టులే విజయం సాధించారు. ఇక్కడ 47 ఏళ్ల పాటు ఎర్రజెండా పాలనే సాగింది.
ఇద్దరిలో ఒకరు
2007లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా లోక్సత్తా సంస్థ మచ్చలేని నేతలను ఇద్దరిని మాత్రమే గుర్తించగా అందులో నర్రా ఒకరు. ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నాడు ఆ సంస్థ ఆధ్వరంలో హైదరాబాద్లో రాఘవరెడ్డిని ఘనంగా సన్మానించారు.
ఇదీ.. ప్రస్థానం
నియోజకవర్గంలోని చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన రాఘవరెడ్డి బడికి వెళ్లాల్సిన 16 ఏళ్ల వయసులో ముల్లు కర్ర పట్టి పశువులు మేపేందుకు వెళ్లారు. ముంబాయి జిన్నింగ్ మిల్లుల్లో కార్మికుడిగా జీవితం ప్రారంభించి.. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చారు. అవినీతి అక్రమాలు, బంధుప్రీతికి దూరంగా ఉంటు తన ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు.
- నాడు రైతుల భాగస్వామ్యంతో నియోజకవర్గంలో ఒకే సారి 50 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు.
- ఎమ్మెల్యేలకు హైదరాబాద్లో ప్రభుత్వం ఇంటిస్థలం ఇచ్చినా తీసుకోకుండా ఆదర్శంగా నిలిచారు.
- ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు వచ్చే వేతనంలో కొంత భాగాన్ని పార్టీకి ఇచ్చేవారు.
వరుస విజయాలు
1967లో సీపీఎం నుంచి రాఘవరెడ్డి తొలిసారి విజయం సాధించారు. 1972లో పరాజయం పాలయ్యారు. 1978, 1983, 1985, 1989, 1994 ఎన్నికల్లో వెనుతిరిగి చూడకుండా వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. 1999 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. వయో భారంతో 2015 ఏప్రిల్ 9న తన 91వ ఏటా మరణించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఆధ్వర్యంలో ధర్నా
[ 09-03-2026]
యాదగిరిగుట్ట పట్టణంలోని ఇందిరా కాలనీలో గతంలో బలహీన వర్గాలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను క్రయ విక్రయాలకు వీలు లేకుండా నిషేధిత జాబితాలో పెట్టడంపై భాజపా ఆధ్వర్యంలో స్థానికులు ధర్నా చేపట్టారు. -
అందరూ భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే వీరేశం
[ 09-03-2026]
‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. -
అగ్గి రాజుకుంటే బుగ్గే!
[ 09-03-2026]
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ సీజన్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. అగ్గిరాజుకుంటే సకాలంలో అగ్నిమాపక వాహనం వెళ్లి మంటలను ఆర్పాల్సి ఉంటుంది. -
చట్టం.. ఆమెకు రక్షణ కవచం
[ 09-03-2026]
ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలు చేస్తోంది. అవగాహన ఉన్నప్పుడే హక్కులను పరిరక్షించుకోవచ్చు. -
పాపాలు నిత్యం..చర్యలు నామమాత్రం!
[ 09-03-2026]
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కల్తీ పాలతో ప్రజల ప్రాణాలు పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నా అక్రమార్కులపై చర్యలు నామ మాత్రంగానే ఉంటున్నాయి. -
ఆటకు స్థలమేదీ..?
[ 09-03-2026]
క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాల కొరత ఎదురవుతోంది. ఉమ్మడి… జిల్లాలో కొన్ని చోట్ల గుర్తించినా ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. -
వినోదం పంచుతూ.. సాయం అందిస్తూ!
[ 09-03-2026]
‘ఒరేయ్..రాము! పొద్దస్తమానం ఆ సెల్ఫోన్ పట్టుకొని రీల్స్ చూసే బదులు ఏదైనా పనిచేసి నాలుగు పైసలు సంపాదించవచ్చుగా..’’ అని అరిచింది వాళ్లమ్మ. -
తప్పుటడుగులు..!
[ 09-03-2026]
చదువుకోవాల్సిన ప్రాయంలో బాలికలు తప్పటడుగులు వేస్తున్నారు. తెలిసీతెలియని వయసులో ప్రేమ పేరుతో ఆకర్షణకు లోనై మోసపోతున్నారు. -
పల్లె నుంచి ప్రగతి వైపు
[ 09-03-2026]
వంటింటికే పరిమితమనే నానుడిని తుడిపేసి తాము స్వయంగా ఇంటి వద్ద ఉంటూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడతామని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. -
పిల్లల్ని కొనొద్దు.. దత్తతే ముద్దు
[ 09-03-2026]
2024 మే 25న తుర్కపల్లి మండలం మోతీరాంతండాలో పుట్టిన రెండు రోజులకే శిశువును విక్రయించారు. -
కదలరు.. కమీషన్లు వదలరు..!
[ 09-03-2026]
విద్యుత్తుశాఖ ఉద్యోగ, సిబ్బందిపై తరచూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఒకే స్థానంలో కదలకుండా ఉండటంతో వారు ఆడిందే ఆట..పాడింది పాటగా మారింది. -
గట్టుప్పల్లో ఘనంగా మహిళా దినోత్సవం
[ 08-03-2026]
మండల కేంద్రమైన గట్టుప్పల్లోని చర్చిలో ఆదివారం మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. -
భారత జట్టుకు గట్టుప్పల్ యువతి ఎంపిక
[ 08-03-2026]
నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల కేంద్రానికి చెందిన పగిల్ల చందన బాల్ బ్యాడ్మింటన్ భారత జట్టుకు ఎంపికయ్యారు. -
స్వాతి నక్షత్రం సందర్భంగా యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు
[ 08-03-2026]
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర శత ఘట్టాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఆదివారం నిర్వహించారు. -
వెలిమినేటి వారింట..విజయాల జంట..!
[ 08-03-2026]
అఖిల భారత సర్వీస్లో విధులు నిర్వహించాలన్నది వారి కల. చదువుతున్నప్పుడు సివిల్స్ సాధించాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. కృషి.. పట్టుదల.. ఆత్మస్థైర్యంతో తీవ్రంగా కష్టపడ్డారు -
కొలువు కొన్నా.. కోలుకోలేదు..!
[ 08-03-2026]
జిల్లాలోని నీటిపారుదల శాఖలో పొరుగు సేవల పద్ధతిలో పనిచేస్తున్న లస్కర్లు వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు చెల్లించి విధుల్లో చేరితే ఇప్పటివరకు జీతం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. -
నాడీమణి..!
[ 08-03-2026]
సమాజంలో వైద్యవృత్తిని అత్యున్నతమైనదిగా భావిస్తారు. ఒకప్పుడు వైద్య విద్య దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు కలగానే మిగిలిపోయేది. కాలక్రమేణా పరిస్థితులు మారాయి. -
వస్త్ర ప్రపంచంలో..వనితా..!
[ 08-03-2026]
పట్టణాలు వేగంగా విస్తరిస్తుండగా.. అందుకు అనుగుణంగా వ్యాపారాలూ ఊపందుకుంటున్నాయి. హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో వెలుస్తున్నాయి. -
కుటుంబం నుంచే వివక్ష వీడాలి
[ 08-03-2026]
కుటుంబంలోని మహిళలను గౌరవంగా చూసుకుంటే ఆ కుటుంబం అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తుందని అక్కడి నుంచే వివక్ష వీడాలని ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి పి.ముక్తిదా అన్నారు -
గద్దర్ అవార్డు బాపూజీకి దక్కిన గౌరవం
[ 08-03-2026]
చేనేత పితామహుడు, తెలంగాణ ఉద్యమనేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఇతివృత్తంతో ‘యూనిటీ- ద మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్’ పేరుతో చౌటుప్పల్కు చెందిన చిరందాసు శ్రీకాంత్ భూదాన్పోచంపల్లికి చెందిన విజయ్కుమార్ బడుగు దర్శకత్వంలో నిర్మించిన డాక్యుమెంటరీ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డు-2025ను ప్రకటించింది. -
హితం కోరి..బంధాల బలోపేతం..!
[ 08-03-2026]
ఎన్నెన్నో కలలతో వివాహ బంధంతో ఒక్కటైన దంపతుల మధ్య విభేదాలు తలెత్తడం.. కుటుంబంలో చికాకులతో భార్యాభర్తల మధ్య తగవులు రావడం.. ఇలాంటి ఫిర్యాదులతో వచ్చే జంటలకు చౌటుప్పల్లోని కుటుంబ సలహా కేంద్రంలో పరిష్కారం చూపుతున్నారు -
మరొకరి మృతదేహం లభ్యం
[ 08-03-2026]
సాగర్ ఎడమ కాల్వలో శుక్రవారం మరొకరు గల్లంతైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్ల్లు తెలిపిన వివరాల ప్రకారం... మిర్యాలగూడ పట్టణం ముత్తిరెడ్డికుంటకు చెందిన మర్రి రవి, జలాల్, ఏశాల సతీష్ (38) ద్విచక్ర వాహనంపై శుక్రవారం మధ్యాహ్నం వేములపల్లి మండల కేంద్రంలోని సాగర్ ఎడమ కాల్వలో ఈత కొట్టేందుకు వెళ్లారు.








