రెండో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం
రెండో లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ స్థానం నుంచి సాదత్ అలీఖాన్, మహబూబాబాద్ నుంచి ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి : రెండో లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. వరంగల్ స్థానం నుంచి సాదత్ అలీఖాన్, మహబూబాబాద్ నుంచి ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు. 1957లో జరిగిన ఎన్నికల్లో వరంగల్ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(ఐఎన్సీ) అభ్యర్థి సాదత్ అలీఖాన్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) పార్టీ అభ్యర్థి పెండ్యాల రాఘవరావుల మధ్య ముఖాముఖి పోటీ ఎదురైంది. కాంగ్రెస్ అభ్యర్థి సాదత్ అలీఖాన్నే విజయం వరించింది. ఆయన 14,955 ఓట్ల మెజార్టీ సాధించారు. మొత్తం 3,43,246 ఓట్లకు 1,99,543 ఓట్లు పోలయ్యాయి. 58.13 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి ఎన్నికల కంటే పోలింగ్ 7.1 శాతం పెరిగింది. వరంగల్ జనరల్ స్థానం నుంచి మొదటి ఎన్నికల్లో గెలుపొందిన రాఘవరావు రెండోసారి పోటీచేసి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ మొదటి ఎన్నికల్లో ఓటమి చెందిన కాళోజీ నారాయణరావుకు బదులు హైదరాబాద్కు చెందిన సాదత్ అలీఖాన్ను బరిలో దించింది.
1957లో రెండో లోక్సభ ఎన్నికల సమయంలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఆవిర్భవించింది. ఈ స్థానానికి మొదటి ఎన్నికలు 1957లో జరిగాయి. మొదటి ఎంపీగా ఇటికాల మధుసూదనరావు ఎన్నికయ్యారు. తన సమీప పీడీఎఫ్ అభ్యర్థి సర్వదేవభట్ల రామనాథంపై 7,256 ఓట్ల ఆధిక్యం సాధించారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో 3,72,879 ఓట్లకు గాను 2,00,672 ఓట్లు పోలయ్యాయి. 53.82 శాతం పోలింగ్ నమోదైంది. మధుసూదనరావు స్వగ్రామం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి.. స్వాతంత్య్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోటళ్లకు వినూత్న పేర్లు.. రుచుల విందు
[ 29-04-2024]
ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే భిన్నంగా ఆలోచించాలి.. రెస్టారెంట్ల వ్యాపారంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. -
ఉద్యమ నేతను చూసి ఉప్పొంగిన ఆనందం
[ 29-04-2024]
గులాబీ దళపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర హనుమకొండ నగరంలో ఆదివారం విజయవంతమైంది. నక్కలగుట్టలో సాయంత్రం 4 గంటల నుంచి వరంగల్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో భారాస నేతలు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. -
విపణిలో ధర లేదు.. గిడ్డంగిలో జాగ లేదు!
[ 29-04-2024]
ఉమ్మడి వరంగల్వ్యాప్తంగా ఎర్ర బంగారం పండించిన రైతులు ఈసారి నష్టాల ఘాటులో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
ఓరుగల్లు ముద్ర ఉండాల్సిందే..!
[ 29-04-2024]
వారంతా ఇప్పుడు లోక్సభ పోరులో హోరాహోరీగా తలపడుతున్నారు. పార్లమెంటులో అడుగుపెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. -
భాజపాతోనే మాదిగలకు న్యాయం
[ 29-04-2024]
భాజపాతోనే మాదిగలకు న్యాయం జరుగుతుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ పేర్కొన్నారు. -
బడుల మరమ్మతులకు సన్నద్ధం
[ 29-04-2024]
వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-04-2024]
జిల్లాలో రైతు వేదికల నిర్వహణ అధికారులకు భారమైంది. కొంత కాలంగా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి. -
‘హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్’
[ 29-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మోసపూరిత హామీలిచ్చి.. ఒకటి రెండే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని పెద్దపల్లి భారాస ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
నిప్పుల కుంపటి
[ 29-04-2024]
జిల్లాలో ఎండలవేడి నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే ఎండలు తీవ్రమై రోజురోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. -
17 నెలలు 17 కి.మీ!
[ 29-04-2024]
జాతీయ రహదారి 353సీˆ మన రాష్ట్రంలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం నుంచి మొదలై హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ వరకు 101 కిలోమీటర్లు సాగుతుంది. -
డంపర్లకు టైర్ల కొరత
[ 29-04-2024]
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి కేంద్రాలైన ఉపరితల గనుల్లో నడిచే డంపర్లకు టైర్ల కొరత ఏర్పడింది. -
అటకెక్కిన ఆధునికీకరణ
[ 29-04-2024]
మంగపేట మండలం నర్సింహసాగర్ సమీపంలో వర్షాధారంగా నిర్మించిన మల్లూరు వాగు ప్రాజెక్ట్ను ఆధునికీకరించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
ఫలితాలు మెరుగుపడాలి..!
[ 29-04-2024]
ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం అనుకున్నంతగా ఆశాజనకంగా లేదు. -
తండా ఒక్కటే ‘లోక్సభ’ నియోజకవర్గాలే వేరు
[ 29-04-2024]
ఒక పల్లె ప్రజలంతా పంచాయతీ, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడం సాధారణం.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య