హ్యాట్రిక్ వీరుడు కమాలుద్దీన్

గోపాలపూర్, న్యూస్టుడే: ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో హ్యాట్రిక్ వీరుడిగా కమాలుద్దీన్ అహ్మద్ నిలిచారు. మొత్తం ఏడు సార్లు పోటీలో దిగి నాలుగు సార్లు విజయం సాధించారు. మొదటి సారి వరంగల్ లోక్సభ స్థానానికి 1980లో కాంగ్రెస్ (ఐ) నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్(యు) అభ్యర్థి టి.పురుషోత్తంరావుపై గెలుపొంది లోక్సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత రెండోసారి ఇదే స్థానం నుంచి 1984లో పోటీచేసి తెదేపా అభ్యర్థి టి.కల్పనాదేవి చేతిలో ఓటమి పాలయ్యారు. మళ్లీ వరంగల్ స్థానంలో బరిలో నిలవలేదు. 1989లో హనుమకొండ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి చందుపట్ల జంగారెడ్డిపై విజయం సాధించారు. ఇదే స్థానంలో 1991లో జరిగిన ఎన్నికల్లో తెదేపాకు చెందిన వంగా సుదర్శన్రెడ్డిపై రెండోసారి, 1996లో తెదేపా అభ్యర్థి బస్వారెడ్డిపై మూడోసారి విజయం సాధించారు. ఇలా వరుసగా ఒకే స్థానం నుంచి మూడుసార్లు కమాలుద్దీన్ అహ్మద్ గెలిచి హ్యాట్రిక్ పొందారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగులు వెంకన్న ఆలయం మూసివేత
[ 03-03-2026]
జనగామ జిల్లాలోని చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. -
రంగుల పండగ.. సంప్రదాయమే నిండుగా!
[ 03-03-2026]
హోలీ.. అనగానే అందరి మది పులకరిస్తుంది.. ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆనందం ఉప్పొంగుతుంది. పిల్లలు, పెద్దలు, మహిళలు.. అన్ని వర్గాల ప్రజలు పాటించే రంగుల పర్వదినం మంగళవారం రానే వచ్చింది. -
చందర్ ఆలోచన.. ‘చద్దన్నం’ మూట
[ 03-03-2026]
హనుమకొండలోని సుధానగర్కు చెందిన సుధాపాటి పున్నంచందర్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ మార్కెటింగ్ చదివారు. తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. -
సమస్యల ‘ఎదురు’ఈత
[ 03-03-2026]
హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న బాలసముద్రంలోని ప్రభుత్వ ఈత కొలను కొంతకాలంగా వెలవెలబోతోంది. గతేడాది చేపట్టిన మరమ్మతులు కొంత ఆలస్యమైనా అధికారులు పూర్తి చేశారు. -
అగ్గి రాజుకుంటే.. బుగ్గే
[ 03-03-2026]
వేసవి ప్రారంభం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ. అడవులు అధికంగా ఉన్న జిల్లా కావడంతో.. ఏటా వేసవిలో అగ్ని ప్రమాదాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. -
రైతుల కళ్లలో కారం..
[ 03-03-2026]
ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఖమ్మం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో 341 రకం మిర్చిని ఎక్కువగా సాగుచేస్తుంటారు. రంగు, ఘాటుతో కూడిన రుచి ఉండటంతో.. ఈ రకాన్ని కారం తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశీయంగా పచ్చళ్ల తయారీతో పాటు గృహావసరాలకు విరివిగా వినియోగిస్తున్నారు. -
అధికారుల్లో కదలిక.. అనుమతులొచ్చేనా..?
[ 03-03-2026]
మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు 15 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణాలకు మహర్దశ రానుందా అనే అభిప్రాయం కల్గుతుంది. సోమవారం ఇంటిగ్రేటేడ్ రీజినల్ అధికారి త్రినాథ్రెడ్డి (హైదరాబాద్), జాతీయ రహదారి నిర్మాణాల్లో కోల్పోతున్న అటవీ ప్రాంతాన్ని, వృక్ష సంపదను పరిశీలించారు. -
బీడు భూముల్లో సాగునీటి సిరులు
[ 03-03-2026]
ఎస్సీల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. బీడు భూముల్లో సాగునీటి సిరులు నింపేందుకు పీఎంఏజీవై పథకంలో భాగంగా ఎస్సీల కోసం ప్రధాన మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ యోజన(పీఎం అజయ్) పథకానికి శ్రీకారం చుట్టారు. -
మురుగు.. ముంపు తొలగాలి
[ 03-03-2026]
వరంగల్ మహానగరాన్ని మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన పనులపై త్వరలో స్పష్టత రానుంది. మురుగునీటి సమస్యకు పరిష్కారంగా భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, వర్షాకాలంలో కాలనీలు, బస్తీలకు ముంపు ముప్పు లేకుండా చేసేందుకు నాలాల విస్తరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
గంజాయి మత్తులో వసతి గృహాలు!
[ 03-03-2026]
కొద్ది నెలల కిందట జనగామకు చెందిన పది మంది యువకులు ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృషించింది. ఈ ఘటనలో కొందరు యువకులు గంజాయికి బానిసలుగా మారి విచక్షణ కోల్పోయినట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలడం గమనార్హం. -
కి‘లేడీ’ అరెస్టు
[ 03-03-2026]
నగరంలో మహిళా వసతి గృహాల్లో ఉంటూ చోరీలకు పాల్పడుతున్న యువతిని హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. -
కోడిపై మమకారం..!
[ 03-03-2026]
మనుషులకే కాదు కోళ్లకు కూడా ప్రేమానురాగాలు ఉంటాయనేదానికి ఉదాహరణ ఇది.. రోజూ కలిసి తిరుగుతున్న రెండు టర్కీ కోళ్లలో ఒకటి అకస్మాత్తుగా మృతి చెందింది. దీంతో మరో కోడి ఆ కోడి కళేబరం వద్దనే ఉంటుండడం ఆ గ్రామస్థులను కలిచివేసింది. -
మురికి కూపంగా భద్రకాళీ చెరువు..!
[ 02-03-2026]
భద్రకాళీ చెరువులో నగర వ్యర్థాలు పెద్దఎత్తున చేరుతుండడంతో చెరువు మురికి కూపంగా మారుతోంది. -
అరచేయి.. అమ్మఒడి మాదిరి
[ 02-03-2026]
వరంగల్ ఎంజీఎం కూడలిలో రూ.35 లక్షలతో అభివృద్ధి చేసిన మాతాశిశు సంరక్షణ ప్రతిమ కూడలిని మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. -
పారిశ్రామిక పట్టాలపై ప్రగతి పరుగు!
[ 02-03-2026]
ఉమ్మడి వరంగల్ జిల్లాకు తలమానికంగా నిలువనున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులు పరుగులు పెడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.521 కోట్లు కాగా, పూర్తయ్యేసరికి రూ.900 కోట్లు అవుతుంది. -
ఇంతులు.. ‘శ్రీవారి’ భాగ్యమంతులు
[ 02-03-2026]
తిరుమల శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. ఇటీవల మహిళలు బృందాలుగా అక్కడికి వెళ్తున్నారు. హనుమకొండ వరంగల్, కాజీపేట నుంచి అనేక మంది మహిళలు ఆన్లైన్లో ముందస్తు బుకింగ్ చేసుకుని శ్రీవారి సేవకు వెళ్తున్నారు. -
మిగిలింది ఇద్దరే!
[ 02-03-2026]
మావోయిస్టు పార్టీకి మరో కుదుపు.. ఇప్పటికే పార్టీ అగ్రనేతలంతా బయటకు వచ్చిన క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మరో కీలక నేత కూడా లొంగిపోయారు. -
విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయుడు
[ 02-03-2026]
విద్యార్థులను ఓ ఉపాధ్యాయుడు విక్షణారహితంగా చితకబాదిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థి తల్లిదండ్రులు, ఎంఈవో తెలిపిన వివరాల ప్రకారం.. -
అదిగదిగో క్రికెట్ స్టేడియం
[ 02-03-2026]
సీఎం రేవంత్రెడ్డిని కలిసి క్రికెట్ స్టేడియం ఆవశ్యకతను వివరించడంతో సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం స్టేడియం దస్త్రం ప్రభుత్వం వద్ద ఉంది.అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం వరంగల్కు త్వరలో వస్తుంది. -
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు
[ 02-03-2026]
తమ స్నేహితుడి అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న ఇద్దరు స్నేహితులు ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొని దుర్మరణం చెందారు. స్థానికులు, కమలాపూర్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. -
పాకాల.. వలస విహంగాల కిలకిల!
[ 02-03-2026]
వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు కాలుష్య రహిత సరస్సుగా గుర్తింపు పొందింది. జీవవైవిధ్యానికి పేరు పొందిన పాకాల అభయారణ్యం.. పలు రకాల ఔషధ మొక్కలతో పాటు పక్షులు, వన్యప్రాణులకు నిలయంగా మారింది. -
ఫోన్ కొనివ్వడంలేదని బాలిక ఆత్మహత్య
[ 02-03-2026]
తండ్రి ఫోన్ కొనివ్వడం లేదని బాలిక ఆత్మహత్య చేసుకుంది. మిల్స్కాలనీ సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం కలహంది మండలం కోటాగాన్ గ్రామానికి చెందిన నాగ్ భరత్ కొంతకాలంగా వరంగల్లోని ఉర్సుగుట్ట ప్రాంతంలో ఉంటూ.. -
భూదాన్ భూములు పదిలమేనా..?
[ 02-03-2026]
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భూదాన్ భూముల అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. రాష్ట్ర రాజధాని సమీపంలో ఈ భూములు అన్యాక్రాంతమైనట్లు మొన్నటి దాకా వివాదాలు కొనసాగాయి. -
గుట్ట మట్టి.. గుట్టుగా లూటీ!
[ 02-03-2026]
మన్యంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇసుక, మొరం, మట్టి కాదేదీ అక్రమానికి అనర్హం అన్నట్లు దందా సాగుతోంది. ప్రభుత్వ, నిర్మాణుష్య ప్రాంతాల్లోని గుట్టలను గుట్టుగా ఆధీనంలోకి తెచ్చుకోవడం.








