Balakrishna: చికిత్స కోసం తారకరత్నను బెంగళూరు తరలిస్తాం: బాలకృష్ణ

కుప్పం: తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం తారకరత్న బీపీ 120/80 చూపిస్తుంది. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయింది. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మిగతా పారామీటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు ఆరా తీస్తున్నారు. బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ లేదా అంబులెన్సా అని ఆలోచిస్తున్నాం. బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని బాలకృష్ణ వెల్లడించారు.
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే యువగళం సైనికులు, సెక్యూరిటీ సిబ్బంది తారకరత్నను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని బాలకృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యవేక్షిస్తున్నారు.అస్వస్థతకు గురైన నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తెదేపా అధినేత చంద్రబాబు ఆరా తీశారు. తారకరత్నకు చికిత్స అందిస్తోన్న కుప్పంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటి నుంచే కొలువు
[ 19-12-2025]
విద్యార్హతలు ఉన్నా పరిస్థితుల ప్రభావంతో ఉద్యోగాలకు బయటకు వెళ్లలేక చాలామంది స్థానికంగానే ఉండిపోతున్నారు. ఇలాంటి వారి కోసం కూటమి ప్రభుత్వం కౌశలం పథకానికి శ్రీకారం చుట్టింది. -
పంట తీపి.. ప్రతిఫలం చేదు..
[ 19-12-2025]
రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనన్ని చక్కెర కర్మాగారాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండేవి. కానీ తదనంతర కాలంలో చాలా వరకు మూత పడటంతో రైతులు రోడ్డున పడ్డారు. వేరే దిక్కు లేక ఇతర పంటలవైపు మళ్లుతున్నారు. -
ఇంట్లో ఎంత మంది.. ఏం చేస్తారు?
[ 19-12-2025]
గ్రామ, పట్టణాల్లో నివాసం ఉన్న ప్రతి కుటుంబ, ప్రతివ్యక్తి సమాచారాన్ని ఏకీకృత కుటుంబ సర్వే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మాట రాకపోయినా.. కలంకారీగా
[ 19-12-2025]
ఈ కళలో చిన్న పొర తప్పితే దాని రూపం మారిపోతుంది. అలాంటిది పుట్టకతో మూగ (దివ్యాంగుడు).. సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించవచ్చని నిజం చేసి చూపుతున్నాడు శ్రీకాళహస్తికి చెందిన కలంకారీ కళాకారుడు బాలసుబ్రహ్మణ్యం.. -
శిల్పాన్ని చెక్కి.. జీవితాన్ని మలచి
[ 19-12-2025]
భారతీయ పురాతన కళకు ప్రాణం పోస్తూనే జీవితాన్ని మలచుకునే అవకాశాన్ని యువతకు కల్పిస్తోంది తితిదే శిల్ప కళాశాల. హిందూ ఆలయాల సంస్కృతిని కాపాడుతూ.. -
ఇంకెన్నాళ్లీ ఉత్తుత్తి ప్రయోగాలు
[ 19-12-2025]
ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా మన విద్యావ్యవస్థలోని లోపాలు మాత్రం మారడం లేదు. పాఠశాల, ఇంటర్ స్థాయిలో విద్యార్థులు కనీసం ప్రయోగశాలల ముఖం చూడకుండానే ఉన్నత విద్య వైపు పరుగులు పెడుతూ ఆవిష్కరణల్లో పాతాళంలో ఉంటున్నారు. -
నాడు ఊకదంపుడు మాటలు.. నేడు ఊరటనిచ్చే చేతలు
[ 19-12-2025]
అవి కాలనీలు కాదు.. ఊళ్లు అంటూ జగనన్న కాలనీలపై ఊకదంపుడు ప్రచారం చేసుకున్న నాటి వైకాపా ప్రభుత్వం పట్టుమని పది ఇళ్లు కూడా నిర్మించలేకపోయింది. -
విద్యుత్తు సేవల్లో.. 21వ స్థానం
[ 19-12-2025]
విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో ఆ శాఖ వెనుకబడింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఆ శాఖ సేవలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
వేధింపుల ఆచార్యుడికి తిరిగి బాధ్యతలు
[ 19-12-2025]
ఎస్వీయూ సైకాలజీ విభాగం ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఆ విభాగం విద్యార్థినులు ర్యాగింగ్, తదనంతర వేధింపులపై గతనెల మూడో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రామోజీ వింటర్ ఫెస్ట్ షురూ
[ 19-12-2025]
పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్సిటీలో గురువారం రామోజీ వింటర్ ఫెస్ట్ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు సాగే ఈ ఫెస్ట్లో తొలి రోజే సందడి మిన్నంటింది.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు: తీవ్ర ఉద్రిక్తత..!
-

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా.. (18/12/2025)
-

యూఎస్లో కూలిన బిజినెస్ జెట్.. పలువురి మృతి!
-

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/12/2025)
-

యూఏఈలో గోడ కూలి కేరళ యువకుడు మృతి
-

అమెరికాలో ఎంతకాలం ఉండొచ్చు..? వీసా గడువుపై ఎంబసీ ఏం చెబుతోందంటే..!


