Pawan kalyan: గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే ఓకే.. లేదంటే ఒంటరిగా: పవన్ కల్యాణ్
ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, ఆ భరోసా జన సైనికులు ఇస్తారా? అని ప్రశ్నించారు. నియంతను కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు.
రణస్థలం: పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తెదేపాతో జనసేన పొత్తు పెట్టుకుంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇటీవల తెదేపా అధినేత చంద్రబాబుతో సమావేశమైనప్పుడు పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి చర్చించలేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో పవన్ మాట్లాడుతూ.. జనసేన వ్యూహంపై పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు.
‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే... 53 నియోజకవర్గాల్లో వైకాపా సాంకేతికంగానే గెలిచింది. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు పిచ్చికూతలు కూస్తున్నారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నేను అలాంటిని వ్యక్తిని కాదు. రూ.25కోట్లు ట్యాక్స్ కట్టే వ్యక్తిని. చంద్రబాబు, పవన్ రెండున్నర గంటలు ఏం మాట్లాడారని గొంతు చించుకుంటున్నారు. సంబరాల రాంబాబు గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి నెట్టేశాడేంటని 18 నిమిషాలు. లా అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది, ఏం చేయాలి అని 38 నిమిషాలు మాట్లాడుకున్నాం. మాట్లాడే కొద్దీ కేసులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండాలి అని గంటన్నర సేపు మాట్లాడుకున్నాం. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. కానీ, దాని వెనుక నేను కోరుకుంటున్నది స్టెబిలిటీ ఆఫ్ స్టేట్. వైకాపా అద్భుతమైన పాలన అందించి ఉంటే నేను గొంతెత్తే వాడిని కాదు. కానీ బాధిస్తా ఉంటే ఎదురు తిరుగుతాం. గతంలో తెదేపాను తిట్టానంటున్నారు.. కానీ, కొన్ని సార్లు సర్దుకు పోవాలి తప్పదు. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదు. సీట్ల గురించి చంద్రబాబుతో నేను మాట్లాడలేదు. రాజకీయాల్లో వ్యూహం ఉండాలి. ఒంటరిగా వెళ్లి వీర మరణం పొందడం అవసరం లేదు. ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోం. ఆ భరోసా జన సైనికులు ఇస్తారా? నియంతను కలిసి కట్టుగా ఎదుర్కోవాలి. గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే వెళ్తాం... లేదంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. రాజకీయాల్లో దశాబ్దం పాటు ఒంటరిగానే పోరాడా. వస్తే జనసేన ప్రభుత్వం.. లేదంటే మిశ్రమ ప్రభుత్వం. రాజకీయం అంతా 3 కులాల చుట్టే ఎందుకు తిరుగుతోంది. రాష్ట్రంలో ఇంకా అనేక కులాలు ఉన్నాయి.. అందరూ సమానమే. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. మీకోసం రోడ్ల మీదకు వస్తా. ఏడాదికి రూ.250 కోట్లు సంపాదించగలను. నా రోజు సంపాదన కోటి రూపాయలు. కోటి మంది ప్రజలకోసం కోట్లు వదులుకోవడానికి సిద్ధం’’ అని పవన్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు