eWebinar: ఆచరణ మీదైతే.. కోరిన కొలువు!
సరైన ప్రణాళికతోనే విజయం
ఈనాడు - ఈప్రతిభ వెబినార్లో నిపుణుల సూచనలు

ఈనాడు ఈప్రతిభ వెబినార్లో మాట్లాడుతున్న నిపుణులు బి.నరేశ్, తాటికొండ ప్రతిజ్ఞ, రేమల్లి సౌజన్య
2026లో ప్రభుత్వ ఉద్యోగ సాధనే లక్ష్యంగా శ్రమిస్తున్న ఆశావహుల కోసం ఈనాడు ఈప్రతిభ ఆదివారం నాడు ఉచిత వెబినార్ నిర్వహించింది. సరైన దిశలో నిరంతర అభ్యాసంతో కోరుకున్న కొలువు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని నిపుణులు పేర్కొన్నారు. పోటీపరీక్షల నిపుణులు రేమల్లి సౌజన్య, డాక్టర్ తాటికొండ ప్రతిజ్ఞ అభ్యర్థులకు విలువైన సూచనలు, సలహాలు అందించారు. కెరీర్ కౌన్సిలింగ్ నిపుణులు డాక్టర్ బి.నరేశ్కుమార్ మోడరేటర్గా వ్యవహరించారు.
నిన్నటి కల.. రేపటి లక్ష్యం
ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. సమయపాలన, అనుసరించాల్సిన వ్యూహం, మైండ్సెట్... ఉద్యోగ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీపరీక్షల్లో పాల్గొనే లక్షలాదిమందిలో కొందరినే విజయం వరిస్తుంది. వారు అనుసరించే టైం మేనేజ్మెంట్, ఆచరణాత్మక ప్రణాళిక, నిరంతర అభ్యాసమే దీనికి కారణం.
అభ్యసనం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. పోటీ పరీక్షల్లో అకడమిక్ పరీక్షల మాదిరిగా తక్కువ సమయంలో చదివి రాయడం కుదరదు. ముఖ్యంగా రీజనింగ్, అరిథ్మెటిక్ లాంటి సెక్షన్లలో సమయాభావం ప్రధాన సవాలుగా నిలుస్తోంది. అందుకే మొదట సులభమైన ప్రశ్నలను ఆన్సర్ చేయడం ఉత్తమం. కఠినమైన ప్రశ్నలతో ప్రారంభిస్తే సమయం వృథా. అభ్యర్థులు తమకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ పట్టు, ఆసక్తి ఉన్నాయో చూసుకుని దానికి అనుకూలంగా ఉండే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే లక్ష్యం చేరుకోగలరు.
డాక్టర్ బి.నరేశ్ కుమార్
సక్సెస్ కోసం R -T - E స్ట్రాటజీ
చాలా మంది పరీక్షార్థులు సామర్థ్యం ఉన్నా.. నిర్వహణ లోపం, సరైన వ్యూహాలు అనుసరించకపోవడం వల్ల ఉద్యోగ సాధనలో విఫలమవుతున్నారు. R - T - E స్ట్రాటజీ ద్వారా ఉద్యోగ పోటీలో ముందుండొచ్చు.
R - రివిజన్ సైకిల్ స్ట్రాటజీ: ఏదైనా టాపిక్ చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను షార్ట్ నోట్స్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు తేలిగ్గా పునశ్చరణ చేసుకోవడానికి వీలుంటుంది. ఉదాహరణకు ఒక వారంలో చదివింది రెండు గంటల్లో రివిజన్ చేసేలా ఉండాలి.
T - టెస్ట్ బేస్డ్ లెర్నింగ్ స్ట్రాటజీ: చదివింది ఎంత వరకు గుర్తుంటుందో తెలుసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. చదవడం ద్వారా టాపిక్పై అవగాహన వస్తుంది. సరిగ్గా నేర్చుకున్నామా.. లేదా అన్నది ప్రాక్టీస్ టెస్ట్స్ రాయడంతో తేలిపోతుంది.
E - ఎర్రర్ ఎలిమినేషన్ మెథడ్ స్ట్రాటజీ: దాదాపు ప్రతి పోటీపరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అందుకే కచ్చితంగా జవాబు తెలిసిన ప్రశ్నలను అటెంప్ట్ చేయడం ముఖ్యం. అంతగా తెలియని వాటి జోలికి వెళ్లకపోవడమే మంచింది.
ఈ మూడు స్ట్రాటజీలు అనుసరించడం ద్వారా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించవచ్చు.
డాక్టర్ తాటికొండ ప్రతిజ్ఞ
ఒకటే పుస్తకం పది సార్లు..
ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల్లో ప్రశ్నా సరళిలో మాత్రమే మార్పు తప్ప అన్నింటి సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది. జనరల్ స్డడీస్ సబ్జెక్ట్స్పై పట్టు సాధిస్తే ఉద్యోగ సాధన సులభతరం అవుతుంది. ఇందుకోసం దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
తెలుగు రాష్ట్రాల నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)కి పోటీ పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. అన్ని స్థాయుల్లో కలిపి ఏటా సుమారు 20 నుంచి 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. బ్యాంక్ మాదిరే ఎస్ఎస్సీ నియామక ప్రక్రియ కూడా ఏడాదిలోపే పూర్తవుతుంది. సిలబస్ పరంగా బ్యాంక్, ఎస్ఎస్సీ ఒకేలా ఉంటాయి.గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎస్ఎస్సీలో ఉద్యోగం సాధిస్తే కెరీర్ బాగుంటుంది. రాష్ట్రస్థాయిలో పోలిస్తే ఏటా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే కేంద్ర ఏజెన్సీలు/ బోర్డు పరీక్షలకు ప్రిపేర్ అయితే మంచి ఫలితం ఉంటుంది.
రేమల్లి సౌజన్య
మల్టిపుల్ రివిజన్స్ తప్పనిసరి..
ఏదైనా విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా కోర్ కాన్సెప్ట్పై దృష్టి సారించాలి. ఒక పుస్తకాన్ని పది సార్లు చదవాలి తప్ప పది పుస్తకాలను ఒక సారి చదిదవం కరెక్ట్ కాదు. మల్టిపుల్ రివిజన్స్తో ఆ టాపిక్ను పూర్తిగా నేర్చుకోవచ్చు. ఈ వ్యూహాన్ని అనుసరించడం ద్వారా తేలిగ్గా ఉద్యోగాన్ని సాధించగలం.

Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

కన్నా నీపై కన్ను పడనీయం
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ చనిపోవడంతో అశ్రునయనాల మధ్య శ్మశానంలో ఖననం చేశారు. తదనంతరం నెలకొన్న అనుమానంతో ఖననం చేసిన ప్రదేశాన్ని సీసీ కెమెరాతో నిత్యం పర్యవేక్షిస్తున్నారు. -

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల పెంపు
శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీమల్లికార్జునస్వామి స్పర్శ దర్శనాలకు సంబంధించిన వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గురువారం తెలిపారు. -

అధికారిణిగా పాలన.. అమ్మలా లాలన!
‘ఏం చిట్టి తల్లీ.. ఏం కావాలి? నేమ్ ప్లేట్ కావాలా? నా పేరు సరిత. పెద్దయిన తర్వాత నువ్వూ ఐపీఎస్ అవుతావా? ఖాకీ డ్రెస్ వేసుకుంటావా? చెప్పు నాన్నా..’ అంటూ విజయవాడ కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ సరిత ఏడుస్తున్న చిన్నారిని చేతుల్లోకి తీసుకుని జోకొట్టారు. -

గవర్నర్ వద్దకు వెళ్లేందుకూ అదే దాదాగిరి
పరామర్శలకైనా.. ఇంకో పేరుతో పర్యటనలకు వెళ్లినా మందీమార్బలంతో భారీగా షో చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్కు అలవాటే. ఆ అలవాటును చివరికి రాష్ట్ర గవర్నర్ను కలిసేందుకు వెళుతున్నపుడు కూడా కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. -

ఆంధ్రా ఊటీ గజగజ
ఆంధ్రా ఊటీ అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్నిచోట్ల మంచు పేరుకుపోయి కనిపిస్తోంది. -

జగన్ వారినేమీ చేయలేరు
‘పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణ బాధ్యత ఎవరైనా తీసుకుంటే.. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జైలుకు పంపుతానని జగన్ బెదిరించడం హేయమైన చర్య. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుకొస్తున్న సంస్థలను బెదిరించడం సరికాదు. -

భూముల లిటిగెంట్లపై పీడీ చట్టం
‘భూ వివాదాల్లో కొందరు కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారు. చిక్కులు పెంచుతున్నారు. వారిపై అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించి, జైల్లో వేస్తాం’ అని ముఖ్యమంతి చంద్రబాబు హెచ్చరించారు. -

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా చంద్రబాబు
ప్రముఖ దినపత్రిక ది ఎకనమిక్ టైమ్స్ ఏటా అందించే ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. -

ఈ ఆరు విధానాలు..గేమ్ ఛేంజర్లు
పరిపాలనలో వినూత్న విధానాలు క్షేత్రస్థాయి నుంచే రావాలని, ఇందుకు కలెక్టర్లే చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఈసారి కలెక్టర్ల సదస్సులో సీఎం కొత్త పద్ధతిని అనుసరించారు. -

ఏఎన్నార్ కళాశాల.. విశ్వవిద్యాలయంగా ఎదగాలి
ఎంతోమందిని ఉన్నతంగా తీర్చిదిద్దిన అక్కినేని నాగేశ్వరరావు కళాశాల మరింత అభివృద్ధి చెంది విశ్వవిద్యాలయంగా ఎదగాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. అందుకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, మంచి వాతావరణం కల్పించడానికి ఇక్కడి నుంచి ఎదిగిన ప్రతిఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. -

దిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికైన సందర్భాన్ని పురస్కరించుకుని తెదేపా ఎంపీలు ఆయనకు అభినందనలు తెలిపారు. దిల్లీ పర్యటన కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం రాత్రి దిల్లీ చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. -

ప్రభుత్వ లక్ష్యాలపై స్పష్టమైన దిశానిర్దేశం
‘‘ప్రజల సంతృప్తే మీ పనితీరుకు గీటురాయి. నంబర్లను నమ్మను. ఆకస్మిక తనిఖీలకు వస్తాను’’ అంటూ రెండు రోజుల సదస్సులో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. -

మేమొచ్చిన 2 నెలల్లో మీరంతా జైళ్లకే
ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహణకు తీసుకునే వాళ్లు మేం అధికారంలోకొచ్చాక రెండు నెలలు తిరక్కముందే జైళ్లలో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించారు. -

జగన్ అవివేకానికి ఇది పరాకాష్ఠ
‘పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఇస్తున్నారని.. ఎవరైనా వాటిని తీసుకుంటే వచ్చిన రెండు నెలల్లోనే జైల్లో పెడతామని జగన్మోహన్రెడ్డి చెబుతున్నారు. ఆయన రాజకీయ అవివేకానికి ఇది పరాకాష్ఠ. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని చంద్రబాబు అన్నారు. -

నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు చుక్కెదురు
మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేష్, అతని సోదరుడు రాముకు కోర్టులో చుక్కెదురైంది. నకిలీ మద్యం కేసులో వీరి బెయిల్ పిటిషన్లను విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు తిరస్కరించింది. -

అన్నదాతకు అందని సాంకేతికత
పలానా ఊళ్లో ఎరువుల నిల్వలు ఎన్ని ఉన్నాయని వ్యవసాయ అధికారులను అడిగితే.. వెబ్సైట్, యాప్లలో చూసి వెంటనే సీఎంకు చెప్పేస్తారు. కానీ, అదే ఊర్లోని రైతులకు మాత్రం ఆ విషయం తెలియదు. మార్కెట్ ధరలపై అధికారులు నిత్యం నివేదికలిస్తారు. -

ఎన్నికల్లో కంటే మా కుటుంబంతో పోటీపడటమే కష్టంలా ఉంది: లోకేశ్
‘నాన్నను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వరించింది. అమ్మ గోల్డెన్ పికాక్ అవార్డును ఇంటికి తెచ్చింది. దేశంలోనే బిజినెస్ రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నా భార్య స్థానం సంపాదించింది. -

దివ్యాంగులు, హిజ్రాలకు ఉచితంగా నైపుణ్య శిక్షణ
రాష్ట్రంలోని దివ్యాంగులు, హిజ్రాలకు సాధికారత, పెంపు, ఉపాధి కల్పనకుగాను ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. -

వైద్య కళాశాలలపై ‘జగన్నాటకం’
వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి పీపీపీ విధానం ఉత్తమమని కేంద్రానికి నివేదిక ఇచ్చిన పార్లమెంటరీ స్థాయీ సంఘంలో వైకాపా ఎంపీ గురుమూర్తి కూడా సభ్యుడేనని.. ఈ విధానానికి మద్దతుగా ఆయన నివేదికపై సంతకం కూడా చేశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పేర్కొన్నారు. -

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం పీపీపీకి ఇవ్వలేదా?
దేశంలో 75% రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానం(పీపీపీ)లో నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని వైకాపా నేతలు పక్కదారి పట్టించి ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కె.పార్థసారథి మండిపడ్డారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

భారత్ను రెచ్చగొట్టేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోందా?
-

ఎడారి దేశంలో భారీ వర్షాలు.. పలు నగరాల్లో అలర్ట్
-

విశాఖలో అదుపుతప్పిన నేవీ గ్లైడర్ .. మరో ప్రాంతంలో దిగడంతో కలకలం
-

నన్ను ఇలా బతకనివ్వండి: బాధిత నటి
-

రివ్యూ: గుర్రం పాపిరెడ్డి.. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
-

అండర్-19 ఆసియా కప్: శ్రీలంకపై విజయం.. ఫైనల్కు భారత్


