News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(17-03-2023)

Updated : 17 Mar 2023 22:54 IST
1/27
సినీ నటులు చిరంజీవి, రామ్‌చరణ్‌  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను శుక్రవారం దిల్లీలో కలిశారు. ఇటీవల ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుపొందింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను అమిత్‌ షా అభినందించారు. సినీ నటులు చిరంజీవి, రామ్‌చరణ్‌ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను శుక్రవారం దిల్లీలో కలిశారు. ఇటీవల ఉత్తమ ఒరిజినల్‌ పాట విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ గీతం ఆస్కార్‌ పురస్కారాన్ని గెలుపొందింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ను అమిత్‌ షా అభినందించారు.
2/27
ఖమ్మం జిల్లా వైరాలో ఇంటర్మీడియట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముసలిమడుగు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు వసతిగృహం వద్దనే బురదలో దిగబడింది. విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కలిసి బస్సును తోసినా ఉపయోగం లేకపోయింది. దీంతో కళాశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులకు విషయాన్ని తెలిపి వైరా నుంచి ఆటోలు రప్పించింది. దీంతో పది నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఖమ్మం జిల్లా వైరాలో ఇంటర్మీడియట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముసలిమడుగు గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థినులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు వసతిగృహం వద్దనే బురదలో దిగబడింది. విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కలిసి బస్సును తోసినా ఉపయోగం లేకపోయింది. దీంతో కళాశాల యాజమాన్యం విద్యాశాఖ అధికారులకు విషయాన్ని తెలిపి వైరా నుంచి ఆటోలు రప్పించింది. దీంతో పది నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.
3/27
సమంత (Samantha), దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). నీలిమ గుణ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు.. ‘దుర్వాస ముని’ పాత్ర పోషిస్తునట్లు తెలుపుతూ సంబంధిత ఫొటోను చిత్రబృదం ట్విటర్‌ వేదికగా పోస్ట చేసింది. సమంత (Samantha), దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’ (Shaakuntalam). నీలిమ గుణ నిర్మాత. ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు.. ‘దుర్వాస ముని’ పాత్ర పోషిస్తునట్లు తెలుపుతూ సంబంధిత ఫొటోను చిత్రబృదం ట్విటర్‌ వేదికగా పోస్ట చేసింది.
4/27
అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. గర్భగుడి కట్టడానికి సంబంధించిన ఈ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పలువురు భక్తులు ఈ పోస్టు కింద ‘జై శ్రీరామ్‌’ అని కామెంట్లు పెడుతూ భక్తిభావాన్ని చాటారు. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. గర్భగుడి కట్టడానికి సంబంధించిన ఈ ఫొటోను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. పలువురు భక్తులు ఈ పోస్టు కింద ‘జై శ్రీరామ్‌’ అని కామెంట్లు పెడుతూ భక్తిభావాన్ని చాటారు.
5/27
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
6/27
న్యూయార్క్‌లోని బెర్నార్డ్‌ బి.జాకోబ్స్‌ థియేటర్‌లో ‘పరేడ్‌’ పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అమెరికన్‌ నటీమణులు క్రిస్టా రోడ్రిగేజ్‌, రాచెల్‌ జగ్లర్‌ హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. న్యూయార్క్‌లోని బెర్నార్డ్‌ బి.జాకోబ్స్‌ థియేటర్‌లో ‘పరేడ్‌’ పేరుతో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి అమెరికన్‌ నటీమణులు క్రిస్టా రోడ్రిగేజ్‌, రాచెల్‌ జగ్లర్‌ హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
7/27
ఫొటోలకు పోజులిస్తున్న రాచెల్‌ జగ్లర్‌ ఫొటోలకు పోజులిస్తున్న రాచెల్‌ జగ్లర్‌
8/27
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.
9/27
విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘ఆగనందే’ పాటను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ‘ఆగనందే’ పాటను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
10/27
ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కబ్జ’. శ్రియ కథానాయిక. ఆర్‌.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నేడు ‘కబ్జ’ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటి తాన్య హోప్‌ ఇలా మెరిశారు. ఉపేంద్ర కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కబ్జ’. శ్రియ కథానాయిక. ఆర్‌.చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నేడు ‘కబ్జ’ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సినీనటి తాన్య హోప్‌ ఇలా మెరిశారు.
11/27
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయాన్ని సినీ దర్శకులు అనిల్ రావిపూడి, త్రినాథరావు, నిర్మాత దిల్ రాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల ఆలయాన్ని సినీ దర్శకులు అనిల్ రావిపూడి, త్రినాథరావు, నిర్మాత దిల్ రాజు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
12/27
ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించుకున్నారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు చర్చించుకున్నారు.
13/27
అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). ‘నాంది’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాలో ‘దేవేరి’ పాటను ఈ నెల 19న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. అల్లరి నరేష్‌(Naresh) హీరోగా విజయ్‌ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘ఉగ్రం’(Ugram). ‘నాంది’ వంటి హిట్‌ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రమిది. మిర్నా మేనన్‌ కథానాయిక. ఈ సినిమాలో ‘దేవేరి’ పాటను ఈ నెల 19న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
14/27
మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) శుక్రవారం ఉదయం దేశ రాజధానికి విచ్చేశారు. తన సతీమణి ఉపాసనతో  దిల్లీకి వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్‌’ అంటూ నినాదాలు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) శుక్రవారం ఉదయం దేశ రాజధానికి విచ్చేశారు. తన సతీమణి ఉపాసనతో దిల్లీకి వచ్చిన ఆయనకు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘జై చరణ్‌’ అంటూ నినాదాలు చేశారు. ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.
15/27
ముంబయిలో జరుగుతున్న భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌ను చూసేందుకు తలైవా రజనీకాంత్‌ వాంఖడే స్టేడియానికి విచ్చేసి సందడి చేశారు. ముంబయిలో జరుగుతున్న భారత్‌, ఆస్ట్రేలియా తొలి వన్డే మ్యాచ్‌ను చూసేందుకు తలైవా రజనీకాంత్‌ వాంఖడే స్టేడియానికి విచ్చేసి సందడి చేశారు.
16/27
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేశం సుసంపన్నంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దేశం సుసంపన్నంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
17/27
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడంపై భాజపా ఎంపీ సీఎం రమేశ్‌.. సినీనటుడు రామ్‌చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడంపై భాజపా ఎంపీ సీఎం రమేశ్‌.. సినీనటుడు రామ్‌చరణ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
18/27
ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘మెన్స్‌ నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌’గా ఖ్యాతి గడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ‘మెన్స్‌ నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌’గా ఖ్యాతి గడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసి అశ్విన్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
19/27
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని నవనాథ సిద్ధులగుట్టపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా ఆర్మూర్‌కు వచ్చిన ఆయన ఈ ఉదయం గుట్టపైన
గుహలోని సిద్ధేశ్వరుడికి అభిషేకాలు చేశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇవ్వడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని నవనాథ సిద్ధులగుట్టపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ‘హాథ్‌ సే హాథ్‌ జోడో’ యాత్రలో భాగంగా ఆర్మూర్‌కు వచ్చిన ఆయన ఈ ఉదయం గుట్టపైన గుహలోని సిద్ధేశ్వరుడికి అభిషేకాలు చేశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం ఇవ్వడంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
20/27
చెన్నై టి. నగర్‌లోని పద్మావతి తాయారు ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నై టి. నగర్‌లోని పద్మావతి తాయారు ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
21/27
పూజలో తితిదే ఛైర్మన్‌ వై. వి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూజలో తితిదే ఛైర్మన్‌ వై. వి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
22/27
సినీనటి కీర్తి సురేష్‌ తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. నానితో కలిసి ఆమె నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. సినీనటి కీర్తి సురేష్‌ తన తాజా ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘జస్ట్‌ ఫర్‌ ఫన్‌’ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. నానితో కలిసి ఆమె నటించిన ‘దసరా’ సినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది.
23/27
24/27
మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ను కలిసి పరామర్శించారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న యువరాజ్‌.. త్వరలోనే ఛాంపియన్‌ తిరిగొస్తాడు అని పోస్టు పెట్టారు. పంత్‌ను కలిసి చాలా నవ్వుకున్నట్లు.. ఆయన ఆశావహ దృక్పథం, ఫన్‌ కలగలిసిన వ్యక్తి అని యువీ తెలిపారు. మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న రిషభ్‌ పంత్‌ను కలిసి పరామర్శించారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న యువరాజ్‌.. త్వరలోనే ఛాంపియన్‌ తిరిగొస్తాడు అని పోస్టు పెట్టారు. పంత్‌ను కలిసి చాలా నవ్వుకున్నట్లు.. ఆయన ఆశావహ దృక్పథం, ఫన్‌ కలగలిసిన వ్యక్తి అని యువీ తెలిపారు.
25/27
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పాప్‌ జంక్షన్ స్ప్రింగ్ సమ్మర్‌ పేరిట వస్త్రాభరణాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్‌ పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పాప్‌ జంక్షన్ స్ప్రింగ్ సమ్మర్‌ పేరిట వస్త్రాభరణాల ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనలో పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు, బ్లాగర్స్‌ పాల్గొని సందడి చేశారు.
26/27
వస్త్రాభరణాల ప్రదర్శనలో పాల్గొన్న ఓ యువతి వస్త్రాభరణాల ప్రదర్శనలో పాల్గొన్న ఓ యువతి
27/27
"నాటు నాటు" పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు పొందిన సినీ గేయ రచయిత చంద్రబోస్ శుక్రవారం అమెరికాలోని ఎమ్‌ఐటీ క్యాంపస్‌కి వెళ్లారు. వర్సిటీ డీన్ అనంత చంద్రకసన్‌, ఇతర బృందంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చంద్రబోస్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

మరిన్ని